Telugu


ఆమదాలవలస డిగ్రీ కళాశాల 1984 లో ఏర్పడింది. కళాశాల తో పాటు తెలుగు విభాగం ప్రారంభం అయినది.ఎందరో గొప్ప అధ్యాపకులు ఈ కళాశాల లొ పని చేసియున్నారు . అనేక సార్లు నంది అవార్డులు అందుకున్నరు. డా. మీగడ రామలింగ స్వామి ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలందించిన వీరు కూడా తెలుగు అధ్యాపకులే. ఎందరో తెలుగు అధ్యాపకులు ఈ విభాగానికి వన్నె తెచ్చారు.  ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం,భాష మెదలయిన విషయాలతో పాటు మాండలికాలకు సంబంధించి విద్యార్ధులలో విజ్ఞానాన్ని పెంపొందించారు. అంతేకాక శ్రీకాకుళం జిల్లాలోని అనేక మంది తెలుగు కవులను, విద్యార్ధులను పరిచయం చేసి అనునిత్యం తెలుగు భాషకు ఎన లేని సేవ  చేసిన కీర్తి ఈ కళాశాల తెలుగు విభాగానికి ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు!